వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎఫైర్: భార్యకు నిప్పంటించిన భర్త, స్టేషన్‌లో లొంగుబాటు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

సూరత్: భార్యపై అనుమానంతో ఆమెకు నిప్పంటించిన ఘటన సూరత్‌లో జరిగింది. శనివారంనాడు నవ్సరి జిల్లాలోని వసండా సిటీలో నిందుతుడిని పోలీసులు కేసు నమోదు చేయకముందే అదుపులోకి తీసుకున్నారు. నిందుతుని పేరు రాజు పండిట్. భార్యకు నిప్పంటించిన తర్వాత నేరుగా వెళ్లి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన అనంతరం తనకు తానే భార్యను హింసించానని తెలపడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించారు.

పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం రాజు పండిట్, అతని భార్య సునీత ఇద్దరూ వసండా సిటీలోని సదాద్ ఫాలియోలో నివాసం ఉంటున్నారు. నిందుతుడి భార్యకు ఇల్లు పొరుగున నివసిస్తున్న ఒక వ్యక్తి తో సంబంధం ఉండటం అతనికి నచ్చలేదు. ఈ విషయంలో గతంలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శనివారంనాడు ఈ గోడవ తారాస్దాయికి చేరి భార్యపై కిరోసిన పోసి, తన వద్ద ఉన్న సిగరెట్ లైటర్‌తో నిప్పంటించాడని తెలుస్తోంది.

Man reaches police station after torching wife over suspected affair

నిప్పంటించిన వెంటనే రాజు పండిట్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లోంగిపోవడంతో... ఆ తర్వాత చుట్టుపక్కలవారు బాధితురాలిని దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈమె పరిస్దితి విషయంగా ఉంది. రాజు పండిట్ తన భార్యను నిప్పంటించిన చోటుని పరిశీలించి వివరాలు సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. దర్యాప్తు నిమత్తం పోలీసులు చుట్టుప్రక్కల ఉన్న వారితో పాటు బంధువల ప్రకటనను నమోదు చేశారు.

English summary
A man surrendered to police in Vansada town of Navsari district on Saturday after setting his wife on fire. The victim was shifted to hospital in hospital by neighbours as the husband left house leaving her burning. Police detained the criminal before the crime got officially registered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X