వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పది వేళ్లూ నరికేశారు, కళ్లలో యాసిడ్ పోశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Man's fingers chopped off; acid poured on his eyes
పాట్నా: బీహార్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల వ్యక్తి చేతుల పది వేళ్లూ నరికేశారు. కళ్లలో యాసిడ్ పోశారు. పాత కక్షలే దాడికి కారణమని అనుమానిస్తున్నారు. కళ్లు పోయిన ఆ వ్యక్తి పాట్నా వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అతని పరిస్థితి నిలకడ ఉంది. అయితే అతనికి చూపు రావడం కష్టమేనని అంటున్నారు. బాధితుడిని వికాస్ యాదవ్‌గా గుర్తించారు. కళ్లను వైద్యుల బృందం పరిశీలిస్తున్నట్లు వైద్య కళాశాల ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ లోకేందర్ ప్రసాద్ హిందూస్తాన్ టైమ్స్‌తో చెప్పారు

యాసిడ్ కార్నియాను పూర్తిగా కాల్చివేసిందని, రెండు చేతులకు తగిలిన గాయాలు నయమవుతున్నాయని ఆయన చెప్పారు. యాదవ్‌పై దుండగులు గత గురువారంనాడు దాడి చేశారని హిందుస్తాన్ టైమ్స్ రాసింది. బాధితుడు పాట్నాకు వంద కిలోమీటర్ల దూరంలో గల సమస్తీపూర్ జిల్లాలోని వన్బౌర్ గ్రామానికి చెందినవాడు.

యాదవ్‌కు నేర చరిత్ర ఉందని, అతనిపై ప్రత్యర్థి ముఠా పైచేయి సాధించిందని పోలీసులు అంటున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ రాసింది. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.

English summary
According to Hindustan Times - All ten fingers of a 19-year-old man were chopped off and acid was poured on his eyes over an old rivalry in a Bihar village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X