వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మర్మాంగాల్లో పొడిచి భార్యను చంపాడు: హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

థానే: మహారాష్ట్రలో వెన్నులో వణుకు పుట్టించే సంఘటన చోటు చేసుకుంది. ట్రావెల్ ఏజెన్సీ నడిపే 38 ఏళ్ల వ్యక్తి మర్మాంగాల్లో పదే పదే పొడిచి భార్యను హత్య చేసి పారిపోయాడు. థానేలోని ఉల్హాస్‌నగర్ టౌన్‌షిప్‌లో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

పారిపోతూ అతను గోడపై వణుకు పుట్టించే హెచ్చరిక రాసి వెళ్లాడు. మరో వ్యక్తిని తాను చంపుతానని అతను గోడపై రాశాడు. కవితా జ్ఞాన్‌టంద్ మేఘరజని (32) శరీరంపై గాయాలతో సోమవారం మరణించి కనిపించినట్లు సెంట్రల్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పిడి పండ్రే చెప్పారు.

Man stabs wife to death, threatens to kill 'next target'

హత్యపై కవిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవిత భర్త జ్ఞానచంద్ నారాయణ్‌దాస్ మేఘరజని ఆమెను కిరాతకంగా చంపి, సోమవారం మధ్యాహ్నానికి ముందే పారిపోయాడని ఆ ఫిర్యాదులో తెలిపారు.

ఇంట్లో గోడపై రాసిన హెచ్చరికను కూడా పోలీసులు గుర్తించారు. నేను బతికి ఉంటే మరొకరిని చంపుతాను అని గోడపై రాశాడు. కవిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కవిత భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దంపతులకు ఐదేళ్ల కూతురు ఉంది. సంఘటన జరిగినప్పుడు పాప నిద్రపోతోంది. లేవగానే రక్తం మడుగులో ఉన్న తన తల్లిని చూసి అమ్మమ్మకు విషయం చెప్పింది.

English summary
In a chilling incident, a 38-year-old man, running a travel agency, allegedly stabbed his wife in her private parts several times and then fled the house in Thane's Ulhasnagar township, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X