మంజు వారియర్ ఫిర్యాదుతో ప్రముఖ దర్శకుడు సనల్ కుమార్ అరెస్ట్: బ్లాక్మెయలింగ్, వేధింపులు
న్యూఢిల్లీ: ప్రముఖ మలయాళం సినీ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ నటి మంజు వారియర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేరళలోని నెయ్యట్టింకర వద్ద సనల్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, సోషల్ మీడియా వేదికగా తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్టులు చేస్తున్నాడని మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

మంజు వారియర్ ఫిర్యాదు సనల్ కుమార్ అరెస్ట్
మంజు వారియర్ ఫిర్యాదు మేరకు కొచ్చిలోని ఎలమక్కర పోలీస్ స్టేషన్లో సనల్ కుమార్పై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, తన అరెస్టుకు ముందు సనల్ కుమార్ ఫేస్బుక్ లైవ్లోకి కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితం విపత్కర పరిస్థితుల్లో ఉందని, తనను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. సనల్ కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కస్టడీకి తీసుకుని కొచ్చికి తరలించారు. సెక్సీ దుర్గా చిత్రాన్ని రూపొందించిన ఈ దర్శకుడ్ని అరెస్ట్ చేసినట్లు ధృవీకరించిన పోలీసులు.. అతనిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని విషయం వెల్లడించలేదు.

మంజు వారియర్పై సనల్ కుమార్ ఎఫ్బీలో పోస్టులు
శశిధరన్ దర్శకత్వంలో మంజు వారియర్ నటించిన 'కాయట్టం' అనే సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ వివాదం జరగడం గమనార్హం. నటి మంజు వారియర్ కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారిందని, ఆమెకు ప్రమాదం ఉందంటూ పలు పోస్టులు చేశారు సనల్ కుమార్. అంతేగాక, ఆమె మేనేజర్లు బినీష్ చంద్రన్, బీనూ నాయర్పైనా తీవ్ర ఆరోపణలు చేశారు.

సనల్ కుమార్ పోస్టులపై స్పందించని నటి, మేనేజర్లు
కాగా, మంజు వారియర్ కేసు నుంచి ఇటీవల కేరళలో చోటు చేసుకుంటున్న ట్రాన్స్జెండర్ల హత్యల వరకు పలు విషయాలను ప్రస్తావిస్తూ భారత రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు చెబుతూ.. ఆ లేఖలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు సనల్ కుమార్. అయితే, ఈ పోస్టులపై నటి కానీ లేదా ఆమె మేనేజర్లు కానీ స్పందించలేదు. సనల్ కుమార్పై మంజు వారియర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications