వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

60 ఏళ్ల కల నెరవేరింది: తెలంగాణపై మన్మోహన్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోకసభ తుది సమావేశంలో చివరి రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ తన వీడ్కోలు ప్రసంగంలో శుక్రవారం తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. శుక్రవారంతో 15వ లోకసభ ముగిసినట్లే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరు దశాబ్దాల తెలంగాణ కల నెరవేరిందని ఆయన అన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోగలమని తాము నిరూపించుకున్నామని ప్రధాని అన్నారు.

తెలంగాణ అనేది జాతి నిర్ణయమని అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం ద్వారా ఈ దేశం నిర్ణయాలు తీసుకోగలదని నిరూపించిందని ఆయన అన్నారు. ప్రతిబంధమైన స్థితిలోనూ తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకున్నామని ఆయన అన్నారు. తమ పనితీరును నిర్ణయించేందుకు ప్రజలకు ఓ అవకాశం లభించిందని ఆయన అన్నారు. 15వ లోకసభలో తనకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Manmohan Singh speaks on Telangana

తమ పార్టీ అగ్రనేత ఆశీస్సులతో తనకు ప్రతిపక్ష నేతగా లోకసభలో పనిచేసే అవకాశం లభించిందని బిజెపి నేత సుష్మా స్వరాజ్ అన్నారు. పార్టీల మధ్య ఉండేవి విబేదాలే తప్ప శుత్రత్వం కాదని ఆమె అన్నారు. లోకసభ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.

తనకు స్పీకర్‌గా అవకాశం ఇచ్చిన పార్లమెంటు సభ్యులందరికీ ధన్యావాదాలు తెలుపుతున్నట్లు మీరా కుమార్ చెప్పారు. తదుపరి లోకసభకు మరింత మంది మహిళలు రావాలని ఆమె ఆశించారు. లోకసభలో మహిళ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటే మరింత సంతోషంగా ఉండేదని ఆమె అన్నారు.

తెలంగాణ బిల్లుకు బిజెపి పూర్తి సహకారం అందించిందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. బిజెపి సహకారంతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని ఆయన అన్నారు.

English summary

 PM Monmohan singh said that 60 yeras of Telangana people fream has been fulfilled with the passage of AP reorganisation bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X