వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చిన మావోయిస్టులు: 10 మంది జవాన్ల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. మావోయిస్టులు ఐఈడి పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కోబ్రా బెటాలియన్‌కు చెందిన 10 మంది సిఆర్‌పిఎఫ్ కమోండోలు మరణించారు. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో గల అటవీ ప్రాంతంలో జరిగింది.

నక్సల్స్ ఐఈడి పేల్చిన తర్వాత వారికి, సిఆర్‌పిఎఫ్ జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. పరిస్థితిని సమీక్షించడానికి సిఆర్‌పిఎఫ్ డిజి మంగళవారం సాయంత్రం సంఘటనా స్థలాన్ని సందర్శిస్తారు.

Maoist ambush leaves 8 CRPF jawans dead in Bihar’s Gaya

జిల్లాలోని ఇమామ్‌గంజ్ సరిహద్దుల్లో గల చంకర్బంద అటవీ ప్రాంతంలో ఆ ఘటన జరిగింది. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలను, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఎదురు కాల్పుల్లో కొంత మంది కోబ్రా బెటాలియన్ జవాన్లు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు.

మొబైల్ ఫోన్ కెనక్టివిటీ సజావుగా లేకపోవడంతో సంఘటనా స్థలం నుంచి సమాచారం సరిగా అందడం లేదు. నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ కోసం 205వ కోబ్రా బెటాలియన్ జవాన్లను అక్కడ ప్రయోగించారు. కోబ్రాకు జరిగి అతి పెద్ద నష్టాల్లో ఇది ఒక్కటిగా భావిస్తున్నారు.

English summary
At least eight CRPF commandos belonging to its elite COBRA battalion were killed on Monday in a Naxal IED blast in the jungles of Bihar's Aurangabad district, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X