మరోసారి ఆధార్ గడువు పొడిగింపు.. సూచనప్రాయంగా వెల్లడించిన కేంద్రం!?
న్యూఢిల్లీ: మరోసారి ఆధార్ గడువును పొడిగించే ఆలోచనలో ఉన్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం సూచనప్రాయంగా వెల్లడించింది. ఆధార్ కేసుపై సుదీర్ఘ విచారణ కొనసాగుతున్నందున, అనుసంధానానికి గడువు మరికొన్ని రోజులు పెంచనుంది.
Recommended Video

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ నెంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ మార్చి 31 వరకు కేంద్రం గడువు విధించిన విషయం తెలిసిందే.

ఆధార్ గడువు పొడిగింపుపై...
ఆధార్ అనుసంధానంపై కేసును విచారిస్తోన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి గడుపు పొడిగింపుపై అటార్నీ జనరల్ కే వేణుగోపాల్ మంగళవారం తెలియజేశారు.

కేసు విచారణ పూర్తయ్యే వరకు...
గత డిసెంబరు 15గా ఉన్న ఆధార్ అనుసంధానం గడువును సుప్రీంకోర్టు సూచనలతో కేంద్రం మార్చి 31 వరకు పొడిగించింది. అయితే రాజ్యాంగ సమగ్రతకు సవాల్గా మారిన ఈ కేసు విచారణ పూర్తయినంత వరకు మార్చి 31 గా ఉన్న గడువును మళ్లీ పొడిగించాలని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ కోరారు.

గడువు పెరుగుతుంది కానీ..
అయితే ఆధార్ అనుసంధానం గడువును గతంలోనే పెంచారని, మళ్లీ మరోసారి పొడిగిస్తారని, కానీ ఈ నెలాఖరుకు దీనిపై ఈ మేరకు ప్రకటన వెలువడినా.. కేసులో పిటిషనర్ల వాదనలు పూర్తిచేయాలని అటార్నీ జనరల్ కోరారు. దీనిపై ధర్మాసనం మాట్లాడుతూ అటార్నీ జనరల్ లేవనెత్తిన అంశం కీలమైందని, ఈ కేసులో పిటిషనర్ల పునరావృత వాదనలకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది.

అంత తక్కువ సమయం ఇస్తే కష్టమే...
వివిధ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో వివిధ శాఖలు, సంస్థలు సర్దుబాటు, సమన్వయం చేసుకోవాల్సి ఉన్నందున గడువు మరింత పొడిగించాలని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ కోరారు. మరోవైపు ఈ కేసులో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ఒకవేళ కోర్టు ఆధార్పై తన తీర్పును మార్చి 20న వెలువరిస్తే ఆ తరువాత అనుసంధానానికి కేవలం పది రోజులు మాత్రమే ఉంటుందని, అంత తక్కువ సమయం చాలకపోవచ్చని అభిప్రాయపడ్డారు. బుధవారం కూడా ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications