ఆటోమొబైల్పై మాంద్యం ఎఫెక్ట్ : రెండురోజులు మారుతి కార్ల ఉత్పత్తి బంద్
హైదరాబాద్ : ఆటో మొబైల్ రంగంలో మాంద్యంతో మారుతి సుజుకీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండురోజుల పాటు కంపెనీ స్పేర్ పార్ట్స్ తయారు చేయబోదని ప్రకటించింది. హర్యానాలోని గురుగ్రామ్, మానేసర్ ప్లాంటులలో ఈ నెల 7, 9 తేదీలను నో ప్రొడక్షన్ డేగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నది. ఇటీవల ఆటోమొబైల్ రంగం భారీ మాంద్యం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆటో, కార్ల విక్రయాలు పడిపోవడంతో ఉత్పత్తి సంస్థలు పరిస్థితిని నిశీతంగా గమనిస్తున్నాయి.
ఈ నెల 7, 9వ తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్, మానేసర్ మారుతి ప్లాంటులలో కార్ల స్పేర్ పార్ట్స్ తయారు చేయబోమని ప్రకటించింది. కేవలం పరిస్థితిని నిశీతంగా గమనిస్తామని పేర్కొన్నది. ఆటో మొబైల్ రంగంపై మాంద్యం ఎఫెక్ట్ చూపడంతో గతనెలలో 33.9 శాతం మాత్రమే విక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా ఏడో నెలలో కూడా ఆటో మొబైల్ రంగం కోలుకోలేదు.

గతేడాది ఆగస్టులో లక్ష 68 వేల 725 కార్లను ఉత్పత్తి చేస్తే .. ఈ సారి అది లక్ష 11 వేల 370కి పడిపోయిందని వివరించారు. ఇదీ ఆటోమొబైల్ విక్రయాల్లో 33.67 శాతామని వివరించారు. ఇక జూలైలో అదీ 25.15 శాతానికి పడిపోయింది. కేవలం లక్ష 33 వేల 625 విక్రయాలు మాత్రమే జరిగాయి.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications