ప్రధాని మోడీ వైఖరికి నేను చింతిస్తున్నా.. ఖండిస్తున్నా: వైగో
న్యూఢిల్లీ: పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదురైనా... ఎండీఎంకే అధినేత వైగో ఆయన మద్దతుదారులతో ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ 60వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తమిళ మీడియా వార్తా కథనాలు ప్రకారం ఎండీఎంకే మద్దతుదారులు ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
Coimbatore: TPDK celebrate LTTE chief Prabhakaran's birthday pic.twitter.com/MuwpFoCNoT
— ANI (@ANI_news) November 26, 2014 ఆ తర్వాత పలు చోట్ల భారీ ఎత్తున సభలు నిర్వహించి శ్రీలంకలోని తమిళుల కోసం ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక నేపాల్ రాజధాని ఖాట్మండ్లో జరుగుతున్న 18వ సార్క్ సదస్సులో శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలకరించడాన్ని వైగో ఖండించినట్లు ఓ ప్రకటన విడుదలయింది.

" సార్క్ సదస్సులో ప్రధానమంత్రి మోడీ వైఖరికి నేను చింతిస్తున్నా. పలువురు తమిళులను చంపిన వ్యక్తితో అలా వ్యవహరించడం సరైంది కాదు. ఇందుకు నేను సిగ్గుపడుతున్నా, ఖండిస్తున్నా" అని వైగో అన్నారు.
I am terribly pained by PM’s attitude,I’m ashamed of it,I condemn it:Vaiko on PM sharing stage with SL Prez at SAARC pic.twitter.com/C8UKpsA1az
— ANI (@ANI_news) November 26, 2014 ఇక శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలని ఉద్యమించి 2009లో లంక సైన్యం చేతిలో హతమైన ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ 60వ జయంతిని ఈరోజు ఘనంగా జరపాలని ఎండీఎంకే నేత వైగో పిలుపు ఇచ్చారు. ప్రభాకరన్ జన్మదిన వేడుకలు జరపడం భారత విధానానికి వ్యతిరేకమని, ఇవి జరగకుండా ఆపాలని తమిళనాడులోని పలు రాజకీయ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
I am fighting the ban(on LTTE), it is totally illegal.Prabhakaran was our leader,we will celebrate his birthday:Vaiko pic.twitter.com/TUSt3lKeiA
— ANI (@ANI_news) November 26, 2014 మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతికి కారణమైన ప్రభాకరన్ పుట్టినరోజుని జరగకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కోరారు. వైగోపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు
శ్రీలంక అధ్యక్షుడు మహింద్ర రాజపక్సేకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదుగురు భారతజాలర్లను క్షమించి వదిలిపెట్టినందుకుగాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. డ్రగ్స్ అక్రమరవాణా కేసులో ఐదుగురు తమిళజాలర్లకు శ్రీలంక ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిన విషయం తెలిసిందే.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications