ఆసుపత్రిలో అమ్మాయిల చిందులు, రోగుల అవస్థ
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఓ ఆసుపత్రిలో షాకింగ్ అంశం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిని ఫంక్షన్ హాలులా మార్చేశాడు ఓ ఉద్యోగి. ఈ తీరుతో ఆసుపత్రిలోని రోగులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన యూపీలోని బులంద్ షహర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
ఈ సంఘటన రెండు రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 28వ తేదీన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తన కూతురు వివాహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించాడు. వివాహ వేడుకల్లో భాగంగా పాటలు, డ్యాన్సులు, హోరెత్తించారు. దీంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

వైద్యులు, నర్సులతో సహా చాలామంది సిబ్బంది అంతా పెళ్లికి హాజరు కావడంతో రోగులను ఎవరూ పట్టించుకోలేదు. వృద్ధులు, గర్భిణీలు ఇలా చాలామంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఘటన పైన ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది.
ఆసుపత్రి సిబ్బంది అక్కడే మ్యారేజీ పార్టీ చేసుకోవడం, విందు భోజనాలు ఏర్పాటు చేసుకోవడం, చిందులు వేయడం, మరో పక్క రోగులు సాయం కోసం అర్థిస్తున్నా వైద్యులకు పట్టలేదు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications