వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంటెస్ట్: రూ.1కే మిజు ఎం2 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ మిజు.. ఎం2 పేరుతో కొత్త ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ ధర రూ.6,999. స్నాప్‌డీల్‌ ద్వారా అమ్మకానికి సిద్ధంగా ఉంది. అయితే, ఒక రూపాయికే ఈ ఫోన్‌ని పొందే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. ఈ ఫోన్‌ ప్రచార కార్యక్రమాన్ని సంస్థ ప్రారంభిస్తూ ‘రూ.1 కే ఎం2' అంటూ ఓ ఆన్‌లైన్‌ కాంటెస్ట్‌ని సైతం ప్రకటించింది.

రూపాయికే ఫోన్‌ పొందాలంటే మీరు చెయ్యాల్సిందల్లా.. మిజు లోగో ఫోన్‌పై ఎక్కడ, ఎలా ఉంటే బాగుంటుంది? అనేదాన్ని వూహించి పెయింట్‌ చేసి ఆ చిత్రాన్ని మిజు ఇండియా ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చెయ్యాలి.

 Meizu m2 smartphone can now be purchased for Re 1 via contest

#?m2for1హ్యాష్‌ ట్యాగ్‌తో ఆ చిత్రాన్ని పోస్ట్‌ చెయ్యాల్సి ఉంటుంది. డిసెంబర్ 15 నుంచి 21 వరకు ఈ పోటీ కొనసాగుతుంది. అలా వచ్చిన చిత్రాల్లో మంచి వాటిని సంస్థ ఎంపిక చేస్తుంది. అలా ఎంపికైన వారందరికీ రూ.1కే ఎం2 ఫోన్‌ని కంపెనీ అందజేస్తుంది.

కాగా, కాంటెస్ట్‌లో పాల్గొననివారు రూ.7వేలకు ఈ ఫోన్‌ను స్నాప్‌డీల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఐఫోన్ 5సిని పోలిన పాలీకార్బనేట్ యూనిబాడీ, 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720X1280 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary
Meizu is offering its fans an opportunity to buy the Meizu m2 for only Re. 1 via the #m2for1 contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X