MH Election 2024:మన ప్రాజెక్టులు గుజరాత్కు పట్టుకెళ్లారు:మోదీపై పై తెలంగాణ మంత్రులు ధ్వజం
నాందేడ్ / హైదరాబాద్:- మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాఅఘాడి కూటమి విజయం తధ్యమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాందేడ్ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలంటే మహాఅఘాడి కూటమి అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
మహాఅఘాడి కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుత దేశ, రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో మహా అఘాడి కూటమిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మహా అఘాడి కూటమి గెలుపు ఖాయమని ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు .త్వరలో మహరాష్ట్ర ఎన్నికల్లో మహ అఘాడి కూటమి ఘనవిజయం సాధించడం తధ్యమని మంత్రి పొంగులేటి అన్నారు.

మహారాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి అధికారంలోకి రావడం ద్వారా మాత్రమే రాష్ట్రం కాంతివంతంగా వెలుగు జిలుగులు విరజిమ్ముతుందని తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఇక్కడ జరుగుతున్న ఎన్నికలపై యావత్ భారతదేశం దృష్టిలో సారించిందని ఆయన పేర్కొన్నారు.ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు దేశ భవిష్యత్తును మలుపు తిప్పుతాయని ఆయన చెప్పారు.మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఏ.ఐ.సి.సి పరిశీలకుడిగా నియమితులైన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాందేడ్,ఔరంగబాద్, లాతుర్ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలకు తెర లేపిందని దానిని తిప్పి కొట్టేందుకు మహారాష్ట్ర ప్రజలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.మహారాష్ట్రకు చెందిన 17 పారిశ్రామిక ప్రాజెక్ట్లను గుజరాత్ కు తరలించడంపై ఆయన మండిపడ్డారు.అటువంటి పార్టీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.

రాహుల్ గాంధీకి నాందేడ్ విమానాశ్రయంలో స్వాగతం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ సభల్లో పాల్గొనేందుకు వచ్చిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి నాందేడ్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీతో పాటు నాందేడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా నాందేడ్ న్యూ మొండా మైదానంలో జరిగిన బహిరంగ సభతో పాటు వివిధ సభల్లో రాహుల్ గాంధీతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న దృశ్యం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ సభల్లో పాల్గొనేందుకు వచ్చిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి నాందేడ్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.#Maharashtra #Nanded #Congress #Elections… pic.twitter.com/VcbJeptF8Q
— Ponguleti Srinivasa Reddy (@mpponguleti) November 14, 2024
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications