వారంలో మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే
Microsoft: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలు కూడా దీని బారిన పడుతున్నాయి. భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు సైతం ఇదివరకే దశలవారీగా లేఆఫ్స్ ప్రకటించాయి. మైక్రోసాఫ్ట్ సైతం దీనికి మినహాయింపేమీ కాదు. దాదాపుగా 15,000 మంది ఉద్యోగులను తొలగించిందా టెక్ దిగ్గజం.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను మళ్లిస్తోంది. మ్యాన్ పవర్ కంటే కూడా AI ని గట్టిగా నమ్ముకుందా సంస్థ. ఈ పరిస్థితుల మధ్య మైక్రోసాఫ్ట్ మరో ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగుల ఆఫీస్ టైమింగ్స్ ను మరింత కఠినతరం చేయనుంది. 'రిటర్న్ టు ఆఫీస్' (RTO) పాలసీని మరంత టైట్ చేయనుంది. ఇందులో భాగంగా టఫ్ అటెండెన్స్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించింది.

దీనికి సంబంధించి ఉద్యోగులందరికీ కూడా ఇంటర్నల్ ఇమెయిల్స్ పంపించింది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగులు 2026 జనవరి నుంచి వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాలని ఆదేశించింది. మొదట పూగెట్ సౌండ్ ప్రాంతంలో ఈ విధానం అమలులోకి వస్తుంది. ఆ తర్వాత అమెరికాలోని ఇతర ప్రాంతాలకు, అనంతరం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. సంస్థ ఈ కొత్త కఠిన నిబంధనలను దశలవారీగా అమలు చేయనుంది.
ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ వర్క్ పాలసీని అమలు చేస్తోంది మైక్రోసాఫ్ట్. వర్క్ ఫ్రమ్ హోమ్ సహా ఉద్యోగులు ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వొచ్చు. తమ టీమ్ లీడ్ లేదా డివిజన్ మేనేజర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా 50 శాతం వర్కింగ్ అవర్స్ రిమోట్గా పనిచేయడానికి అవకాశం ఉంది. ఈ విధానాన్ని తొలగించింది. ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయానికి రావాలనే నిబంధనను మైక్రోసాఫ్ట్ మరింత కఠినతరం చేస్తోంది. దీనిని జనవరి నుంచి అమలులోకి తెస్తుంది.
మైక్రోసాఫ్ట్ తమ బ్లాగ్ పోస్ట్లో ఈ నిర్ణయం వెనకున్న కారణాలను స్పష్టం చేసింది. తమ టీమ్స్ ఎలా పని చేస్తున్నానే విషయాన్ని పరిశీలించామని, ఫిజికల్ గా కలిసి పని చేసినప్పుడు, వారి పనితీరు మరింత వృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్లు తెలిపింది. ఒకరినొకరు పలకరించుకుంటూ మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా, శక్తిమంతంగా పని చేయగలుగుతారని, ఫలితంగా మరిన్ని మంచి ఫలితాలను అందిస్తారని పేర్కొంది.
జనవరి నుంచి వారంలో మూడు రోజులపాటు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఖచ్చితంగా ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. మొదటి దశలో పూగెట్ సౌండ్ ప్రాంతంలో ఫిబ్రవరి చివరి నాటికి ప్రారంభిస్తారు. రెండో దశలో ఇతర అమెరికాలోని ఇతర ప్రాంతీయ కార్యాలకాలకు దీన్ని విస్తరిస్తుంది. ఆ తర్వాత అమెరికా వెలుపల ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తుంది.
పూగెట్ సౌండ్ ఏరియాలో ఉండే మైక్రోసాఫ్ట్ కార్యాలయానికి 80 కిలోమీటర్ల దూరం పరిధిలో నివసించే ఉద్యోగులు 2026 ఫిబ్రవరి చివరి నాటికి వారానికి మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాలి. వీరికి వ్యక్తిగత ఇమెయిల్ ద్వారా పూర్తి వివరాలు అందుతాయి. ప్రస్తుతానికి పూగెట్ సౌండ్ ఏరియా వెలుపల ఉన్న ఉద్యోగుల గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నిర్దేశిత ఆదేశాలు అందిన తర్వాత వారిని రిటర్న్ టు ఆఫీస్ పరిధిలోకి తెస్తారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications