వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిక్కింలో భూకంపం.. జనం బెంబేలు... 5.4 తీవ్రతతో
సిక్కింలో భూకంపం వచ్చింది. రాజధాని గ్యాంగ్టక్ సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.4గా రికార్డైంది. గ్యాంగ్టక్కి 25 కి.మీ దూరంలో ఈస్ట్-సౌత్వెస్ట్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు వెల్లడించారు. రాత్రి 8:49 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
భూకంపం ధాటికి సిక్కింతో పాటు పొరుగు రాష్ట్రాలైన అసోం, బెంగాల్, బిహార్లోనూ భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. నేపాల్, భూటాన్లోనూ భూప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించారు. ఒక్కసారి భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంపం గ్యాంగ్టక్ నగరాన్ని కుదుపునకు గురిచేసిందని స్థానికులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు.
Comments
English summary
mild earthquake of magnitude 5.4 on the Richter scale hit Sikkim-Nepal border on Monday evening. The earthquake tremors were felt in parts of Bihar, Assam and West Bengal.
Story first published: Monday, April 5, 2021, 22:58 [IST]