వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ కుప్పకూలిన భవనం అమాత్యుడిదేనా? కొనసాగుతున్న సహాయక చర్యలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని ధార్వాడలో నిర్మాణంలో ఉన్న అయిదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న భవన నిర్మాణ కార్మికులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు.

జాతియ పార్టీ ఏర్పాటుపై కేసిఆర్ అట్లా..కేటిఆర్ ఇట్లా, వాట్ ఇజ్ దిస్ కొలవెరి ? జాతియ పార్టీ ఏర్పాటుపై కేసిఆర్ అట్లా..కేటిఆర్ ఇట్లా, వాట్ ఇజ్ దిస్ కొలవెరి ?

ఇంతకీ- ఈ భవనం ఎవరిదనే విషయం చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మంత్రి వినయ్ కులకర్ణిదేనని తెలుస్తోంది. వినయ్ కులకర్ణి కర్ణాటక ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం ధార్వాడ. సుమారు 3000 చదరపు అడుగుల్లో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు.

 Minister Vinay Kulkarni is related to one of the owner of the building which is collapsed in Dharwad

ధార్వాడలోని కుమరేశ్వర నగరలో షాపింగ్ కాంప్లెక్స్ గా దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం నలుగురు యజమానుల్లో మంత్రి వినయ్ కులకర్ణి ఒకరని సమాచారం. అయిదంతస్తుల ఈ భవనం నిర్మాణ పనులు ఏడాదిగా కొనసాగుతున్నాయి. తొలి రెండు అంతస్తుల్లో నిర్మాణాలు పూర్తి కావడంతో.. వాటిని వివిధ వ్యాపార కార్యకలాపాల కోసం అద్దెకు ఇచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. మిగిలిన మూడంతస్తుల్లో నిర్మాణ పనులు నడుస్తున్నాయని అంటున్నారు.

 Minister Vinay Kulkarni is related to one of the owner of the building which is collapsed in Dharwad

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..

నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనపై ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన ట్వీట్ చేశారు. అవసరమైతే సహాయక సిబ్బందిని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ధార్వాడకు పంపించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పారు.

English summary
More than 20 people are feared trapped after an under-construction multi-storey building collapsed in Kumareshwara Nagar in Dharwad district of Karnataka. Though TV reports say two people have died, official confirmation is awaited. According to police officials at Dharwad Suburban Police Station, the incident occurred at around 3:30 pm on Tuesday evening. Police officials from the station and nearby stations, 10 ambulances, 5 earthmovers and 20 fire officials rushed to the spot as the news of the building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X