పెళ్ళికి ఒప్పుకోలేదని మైనర్ బాలికను కిడ్నాప్ చేసి మూడువారాల పాటు అత్యాచారం చేశాడు
మైనర్ బాలికపై మూడు వారాల పాటు అత్యాచారం చేశాడు ఓ యువకుడు. బాలికను కిడ్నాప్ చేసి తన పొలంలో ఓ గుంతలో బందించి మూడువారాలపాటు అత్యాచారం చేశాడు. మూడు వారాల తర్వాత నిందితుడిని , అతనికి సహకరించిన ఏడుగురు ని
అహ్మదాబాద్ :గుజరాత్ లోని మోర్బి జిల్లాలోని కొట్టా నయని గ్రామంలో మైనర్ బాలికపై ఓ యువకుడు మూడువారాలుగా అత్యాచారం చేశాడు. ఆమెను కిడ్నాప్ చేసి బంధించి మరీ అత్యాచారం చేశారు. మైనర్ బాలికను ఆ యువకుడికి ఇచ్చేందుకు ఆ బాలిక కుటుంబసభ్యుులు అంగీకరించలేదు.దీంతో ఆయన ఆ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు.
గుజరాత్ రాష్ట్రంలోని కొట్ట నయని గ్రామానికి చెందిన నరేష్ సోలంకి అనే 19 ఏళ్ళ యువకుడు తన సామాజికవర్గానికి చెందిన అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ళ బాలికను వివాహం చేసుకోవాలని భావించాడు.
ఈ విషయమై భాదిత కుటుంబసభ్యులతో ఆయన చర్చించాడు. అయితే ఆయనకు బాలికను ఇచ్చి వివాహం చేసేందుకు మాత్రం వారు అంగీకరించలేదు. దీంతో నవంబర్ 11వ, తేదిన ఆ బాలికను కిడ్నాప్ చేసి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పొలానికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత పొలంలో ఆమెను ఓ గుంత తవ్వి అక్కడ ఆమెను బంధించాడు.మూడువారాలపాటు ఆ గుంతలోనే ఆమెను పెట్టి అత్యాచారం చేశాడు.
అయితే
ఎట్టకేలకు
ఆ
బాలిక
ఆచూకీని
కనుగొన్నారు.
బాలిక
కుటుంబసభ్యలు,
గ్రామస్థులు
ఆ
బాలికను
విడిపించారు.
నిందితుడితో
పాటు
మరో
ఏడుగురు
కలిసి
తనను
బంధించారని
బాలిక
వివరించింది.అయితే
తనపై
అత్యాచారం
చేసేందుకే
కిడ్నాప్
చేశాడని
బాదితురాలు
కన్నీరుమున్నీరుగా
విలపిస్తోంది.బాలికను
కిడ్నాప్
చేసిన
ఎనిమిదిమందిని
పోలీసులు
అరెస్టుచేశారు.