లాక్కెళ్లి మైనర్ బాలికపై భూస్వామి కొడుకు రేప్
ఛండీఘర్: హర్యానాలోని ఫరీదాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై భూస్వామి కొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం భూస్వామి వద్ద పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 12ఏళ్ల వయసున్న బాలికను 14ఏళ్ల వయసున్న భూస్వామి కొడుకు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక తన తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా జగదల్పూర్ పట్టణంలోని సెక్స్ రాకెట్ నడుపుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు యవతులను అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక పరపా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాపర్పట్టిలోని ఓ ఇంట్లో నలుగురు యువతులు వ్యభిచారం నిర్వహిస్తుండగా.. రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న పోలీసులు ఇందులో విటుల పేర్లను మాత్రం బయట పెట్టలేదు. అదుపులోకి తీసుకున్న యువతుల స్వస్థలాలు రాయ్పూర్, కోల్కత, గౌహతి అని పోలీసులు తెలిపారు.