13 ఏళ్ల మైనర్ పై గ్యాంగ్ రేప్-కేసు పెడదామని స్టేషన్ కొస్తే మరోసారి-పోలీసుల దుర్మార్గం
మహిళలకే కాదు మైనర్లకు రక్షణ కరవవుతోంది. రోడ్లపై, ఇళ్లలో ఎక్కడ కనిపిస్తే అక్కడ మృగాళ్లు రెచ్చిపోతున్నారు, మదంతో కొందరు, మద్యంతో మరికొందరు, అధికారంతో భయపెట్టి ఇంకొందరు అఘాయిత్యాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే బెంబేలెత్తుతుంటే ఇప్పుడు మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
యూపీలోని లలిత్ పూర్ లో ఓ 13 ఏళ్ల మైనర్ ను కొందరు అగంతకులు కిడ్నాప్ చేశారు. ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. చివరికి ముష్కరుల బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ మైనర్.. తల్లి సాయంతో పోలీసు స్టేషన్ ను ఆశ్రయించింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిన విధానాన్ని వివరిస్తూ కేసు నమోదు చేయాలని పోలీసుల్ని కోరింది. అయితే ఆమెకు వారు భారీ షాకిచ్చారు. కేసు పెట్టకపోగా తిరిగి ఆ మైనర్ పై అత్యాచారం చేశారు. దీంతో కుమిలిపోవడం ఆమె వంతయింది.

ఉత్తరప్రదేశ్లో 13 ఏళ్ల దళిత అత్యాచార బాధితురాలు తనను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసినందుకు నలుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మళ్లీ అత్యాచారం చేశాడు. కిడ్నాప్ అయిన తర్వాత ఆగంతకులు ఆమెను మధ్యప్రదేశ్లోని భోపాల్కు తీసుకెళ్లారు. నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి తిరిగి ఇంటికి పంపేశారు. తిరిగి పీఎస్ లో అత్యాచారం తర్వాత బాలిక చైల్డ్లైన్ బృందానికి తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆమె అత్తతో సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్హెచ్ఓను సస్పెండ్ చేశారు.
ఈ ఘటనలో అత్తతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశామని. ఇతర నిందితుల జాడ కోసం దాడులు కొనసాగుతున్నాయని లలిత్పూర్ పోలీసు సూపరింటెండెంట్ నిఖిల్ పాఠక్ తెలిపారు. బాధితురాలు మొదటిసారి ఏప్రిల్ 26 పోలీస్ స్టేషన్కు చేరుకున్నప్పుడు అత్యాచారం కేసు ఎందుకు నమోదు చేయలేదనేది మా దర్యాప్తులో భాగంగా ఉందని లలిత్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు.
-
భారత్లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications