మీదనుండి రైలు దూసుకెళ్లినా మహిళ బయటపడింది!
లక్నో: తన మీద నుండి రైలు దూసుకెళ్లినా ఓ మహిళ సురక్షితంగా బయటపడింది. ఉత్తర ప్రదేశ్లోని ఖుర్జా రైల్వే స్టేషన్లో ఆదివారం ఈ ఆశ్చర్యకర సంఘటన జరిగింది. రాజ్వత్ అనే మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ పట్టాల మధ్యలో పడిపోయింది.
అదే సమయంలో ఆ మార్గంలో వేగంగా దూసుకొచ్చిన దిబ్రూగఢ్ - ఢిల్లీ రాజధాని రైలు ఆమె మీదుగా వెళ్లిపోయింది. రైలు వెళ్లిన అనంతరం గమనిస్తే ఆమె ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఫ్లాట్ ఫాం మీదకు చేరింది.

స్టేషన్ మాస్టారు రాహుల్ సింగ్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఎటువంటి గాయాలు కాకపోవడంతో దీనిపై కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications