వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మీదనుండి రైలు దూసుకెళ్లినా మహిళ బయటపడింది!
లక్నో: తన మీద నుండి రైలు దూసుకెళ్లినా ఓ మహిళ సురక్షితంగా బయటపడింది. ఉత్తర ప్రదేశ్లోని ఖుర్జా రైల్వే స్టేషన్లో ఆదివారం ఈ ఆశ్చర్యకర సంఘటన జరిగింది. రాజ్వత్ అనే మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ పట్టాల మధ్యలో పడిపోయింది.
అదే సమయంలో ఆ మార్గంలో వేగంగా దూసుకొచ్చిన దిబ్రూగఢ్ - ఢిల్లీ రాజధాని రైలు ఆమె మీదుగా వెళ్లిపోయింది. రైలు వెళ్లిన అనంతరం గమనిస్తే ఆమె ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఫ్లాట్ ఫాం మీదకు చేరింది.
స్టేషన్ మాస్టారు రాహుల్ సింగ్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఎటువంటి గాయాలు కాకపోవడంతో దీనిపై కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
Comments
English summary
A 50 year old woman had a miraculous escape today as she emerged unhurt after a Rajdhani express train passed over her when she tripped and fell on railway track at Khurja railway station.
Story first published: Tuesday, September 9, 2014, 10:38 [IST]