మిస్లీడింగ్: సీబీఐ అధికారి ఆత్మహత్యపై మనీష్ సిసోడియా ఆరోపణలకు సీబీఐ కౌంటర్
న్యూఢిల్లీ: ఆప్ నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించాలని ఒత్తిడి చేయడంతోనే దర్యాప్తు సంస్థకు చెందిన ఓ అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన ఆరోపణలకు సీబీఐ సోమవారం కౌంటర్ ఇచ్చింది. ఆయన ఆరోపణలు కేసును తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని మండిపడింంది.
సీబీఐకి చెందిన డిప్యూటీ లీగల్ అడ్వైజర్ జితేంద్ర కుమార్ అనే వ్యక్తి గత వారం దక్షిణ ఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అంతకుముందు సోమవారం మీడియా సమావేశంలో సిసోడియా మాట్లాడుతూ.. ''నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని సీబీఐ అధికారిపై ఒత్తిడి తెచ్చారని.. మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు' అని ఆరోపించారు.
కొన్ని గంటల తరువాత, కేంద్ర ఏజెన్సీ అయిన సిసోడియా చేసిన ఆరోపణలను ఖండిస్తూ ప్రకటన చేసింది. దివంగత జితేంద్ర కుమార్కు ఈ కేసు దర్యాప్తుతో ఏ విధంగానూ సంబంధం లేదని స్పష్టం చేసింది. అతను ప్రాసిక్యూషన్ ఇన్ఛార్జ్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్; ఢిల్లీలో ఇప్పటికే ఛార్జిషీట్ కేసుల విచారణను నిర్వహిస్తున్న ప్రాసిక్యూటర్లను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇంకా, మరణంపై విచారణ జరుపుతున్న ఢిల్లీ పోలీసుల ప్రకారం.. సదర అధికారి తన సూసైడ్ నోట్లో.. తన మరణానికి ఎవరినీ బాధ్యులుగా పేర్కొనలేదు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచారణలో ఉందని, నిందితుల్లో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని సీబీఐ స్పష్టం చేసింది.
"సిసోడియా తప్పుదోవ పట్టించే ప్రకటన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నం, అధికారి మరణంపై విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే" అని ఏజెన్సీ తేల్చి చెప్పింది.
గత ఏడాది నవంబర్లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సిసోడియా ఢిల్లీ నివాసంపై సీబీఐ గత నెలలో దాడులు చేసింది.
సోమవారం, సిసోడియా ప్రధాని నరేంద్ర మోడీపై కూడా విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగడం ద్వారా బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరచడం గురించి మాత్రమే ఆయన ఆలోచిస్తున్నారని ఆరోపించారు.
"అధికారులపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని నేను ప్రధానమంత్రిని అడగాలనుకుంటున్నాను, అలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది. మీకు కావాలంటే నన్ను అరెస్టు చేయండి, కానీ మీ అధికారుల కుటుంబాలను నాశనం చేయవద్దు" అని ఆయన అన్నారు.
సీబీఐ ప్రకటనపై సిసోడియా స్పందిస్తూ, "సిబిఐ అధికారి జితేందర్ కుమార్ దర్యాప్తు అధికారి కాదని నేను అంగీకరిస్తున్నాను. అతను నా కేసును డీల్ చేసే లా ఆఫీసర్. నన్ను ఇరికించి తప్పుడు కథనాలు సృష్టించాలని ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరోపించారు.