కమీషన్ కోసం ఆశపడి కోటి రూపాయాల నగదును మార్చి ఇచ్చాడు
కర్ణాటక :;రద్దైన పెద్ద నగదునోట్లను మార్పిడి చేసుకొనేందుకు బడాబాబులు అడ్డదారులు తొక్కుతున్నారు.బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించి పాత నగదును మార్చుకొంటున్నారు. కొత్త కరెన్సీ కోసం సామాన్యులు ఇక్కట్లు పడుతోంటే బడాబాబులు మాత్రం కమీషన్ ఆశచూపి తమ పనులు చక్కబెట్టుకొంటున్నారు.
కర్ణాటకలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ బ్యాంకు లో పరశిమూర్తి క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. ఆయనను ఓ వ్యక్తి ఆశ్రయించారు. రద్దైన పాత నగదు నోట్లను మార్పిడి చేస్తే పెద్ద ఎత్తున కమీషన్ ఇస్తామని ఆశచూపారు.

కమీషన్ కోసం పరశిమమూర్తి ఆశపడ్డాడు. కోటి రూపాయాల పాత నగదును మార్పిడి చేసేందుకు సిద్దపడ్డాడు. ఆదివారం బ్యాంకుకు సెలవైనా బ్యాంకు వచ్చి మరీ బడాబాబుకు పనిచేసిపెట్టాడు. కోటి రూపాయాల విలువైన పాత నగదు నోట్లను తీసుకొని కొత్త కోటిరూపాయాల నగదును ఓ వ్యక్తికి ఇచ్చాడు.
సోమవారం నాడు బ్యాంకుకు వచ్చిన అధికారులకు బ్యాంకులో ఉన్న రశీదులకు, నగదుకు మద్య చాలా వ్యత్యాసం కన్పించింది. ఈ వ్యత్యాసం తో సిసిటీవి పుటేజ్ ను చూశారు బ్యాంకు అధికారులు . ఈ పుటేజ్ లో పరశివమూర్తి బ్యాంకులోకి ప్రవేశించిన విషయాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే అతణ్ణి పిలిచి మాట్లాడారు. విషయం బయటపడింది.ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications