పన్ను ఎగవేస్తే ఇక అంతే! ఖాతాలు దుర్వినియోగం చేసినా
నల్లధనం మార్చేందుకు ఇతరుల ఖాతాలు వినియోగిస్తే చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది. ఖాతాలు దుర్వినియోగమైతే సొంతదారుపై ఐటీ చట్టం కింద విచారణ చేపడతామని తెలిపింది.
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారుల పైన కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమైంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో చాలామంది నల్ల ధనం కలిగిన వారు తమ డబ్బులను ఇతరులకు ఇచ్చి వారి అకౌంట్ల ద్వారా తెల్ల ధనంగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నల్లధనం మార్చేందుకు ఇతరుల ఖాతాలు వినియోగిస్తే చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది. తమ ఖాతాలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే సదరు వ్యక్తి పైన ఐటీ చట్టం కింద విచారణ చేపడతామని తెలిపింది.

బ్లాక్ మనీ నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరింది. జన్ ధన్ యోజన కింద ఉన్న అకౌంట్ హోల్డర్స్ తమ ఖాతాలను దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. అలా చేస్తే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
కాగా, ఏటీఎంల సామర్థ్యం రూ.4లక్షల నుంచి రూ.60లక్షలకు పెంచనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గురువారం నాడు 22,500 ఏటీఎంలు కొత్త సాఫ్ట్వేర్తో అందుబాటులోకి రాగా, శుక్రవారం నాడు మరో 12,500 ఎటీఎంల సామర్థ్యం పెంపునకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. మరికొద్ది రోజుల్లో మరిన్ని ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications