మి టూ: జర్నలిస్ట్ ప్రియ రమణిపై పరువు నష్టం దావా వేసిన ఎంజే అక్బర్
న్యూఢిల్లీ: తనపై 'మి టు' ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ ప్రియ రమణిపై యూనియన్ మినిస్టర్ ఎంజే అక్బర్ క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ఆమె ఆరోపణలు చేసినందుకు గాను ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో కేసు వేశారు.
అన్యాయంగా తనపై నిందలు మోపుతున్నారని, పలువురు పాత్రికేయులు చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజం కాదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. తనను అవమానపరిచేందుకే ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు.

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆదివారమే ఆయన తెలిపారు. మి టూ ఉద్యమంలో భాగంగా పలువురు మహిళా పాత్రికేయులు తమను ఎంజే అక్బర్ లైంగికంగా వేధించారని సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేశారు.
తనపై వచ్చినవన్నీ తప్పుడు, కల్పిత ఆరోపణలని, తమ లాయర్లు ఈ నిరాధార ఆరోపణలను పరిశీలించి న్యాయపరమైన చర్యలు తీసుకోవడంపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని ఎంజే అక్బర్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉందనగా ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవాలన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications