మాజీ సీఎంతో గడిపిన పాతరోజులు గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, ఆరోజుల్లో అలా జరిగింది
కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీ. ఎస్. యడ్యూరప్పకు కర్ణాటక మాజీ మంత్రి, కేఆర్ పీ పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి జానారెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో కర్ణాటకలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన రోజులను గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 27వ తేదీ మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప పుట్టినరోజు.
మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప 81వ జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి విరామం తీసుకున్న యడ్యూరప్ప పార్టీ నిర్వహణలో, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో నిమగ్నం అయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి, కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ వ్యవస్థాపకుడు, గంగావతి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బి. ఎస్. యడ్యూరప్పకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

గాలి జనార్దన్ రెడ్డి ఆయన ఫేస్బుక్లో మంగళవారం ఓ పోస్ట్ చెయ్యడంతో అది విపరీతంగా వైరల్ అవుతోంది. పేదల పక్షపాతి, రైతు నాయకుడు, మనందరికీ ప్రియ మిత్రుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని రాశారు. బీఎస్ యడ్యూరప్ప కర్ణాటక రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రిగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పనిచేశారని, రాష్ట్రంలో ఆయనను ప్రముఖ వ్యక్తిగా మారారని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు.
కర్ణాటక రాష్ట్ర రాజకీయ చరిత్రలో దృఢమైన నిర్ణయాలతో తనదైన ముద్ర వేసిన మహానేత, మన మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. బీఎస్ యడ్యూరప్పతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని, 2008లో దక్షిణ భారతదేశంలో మొదటిసారి కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్రంలోని వందకు పైగా నియోజకవర్గాల్లో ఆయనతో కలిసి ప్రచారం నిర్వహించి రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు సేవ చేశానని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి తాను కూడా ఆనందంగా సంబరాలు చేసుకున్నానని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో యడ్యూరప్పతో పలుమార్లు వేదికను పంచుకోవడం, మా కుటుంబ కార్యక్రమాల్లో ఆయన చాలాసార్లు పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

కర్ణాటక ప్రజలకు ఇష్టమైన ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప చెరగని ముద్రవేసుకున్నారని, ఆయన జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు, కీర్తిని ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. 2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
తరువాత కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తరువాత బీజేపీకి అధికారంలోకి రావడంతో బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2021 జూలై 26వ తేదీన యడ్యూరప్ప వయసు రీత్యా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎన్నికల రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం యడియూరప్ప కుమారుడు బీవై.విజయేంద్ర శికారిపుర నియోజకవర్గం ఎమ్మెల్యేగా, మరో కొడుకు బీవై రాఘవేంద్ర శివమొగ్గ ఎంపీగా ఉన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications