బీజేపీ పంజాబ్ ఎత్తులు-రేపటి నుంచి కర్తార్ పూర్ కారిడార్ ఓపెన్-అమరీందర్, సిద్ధూ థ్యాంక్స్
పంజాబ్ లో మరో మూడు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అసలే రైతుల సెగ, మరోవైపు ఆప్ దూకుడు, అధికార కాంగ్రెస్ తో తలపడాల్సిన పరిస్ధితుల్లో కొత్త ఎత్లులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19న గురునానక్ జయంతి సందర్భంగా సిక్కులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.
గురునానక్ జయంతిని పురస్కరించుకుని, ఈ సిక్కు గురువుపై ఉన్న గౌరవంతో ఆయన జయంతి సందర్భంగా కర్తార్ పూర్ కారిడార్ ను తిరిగి తెరవాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారీ సంఖ్యలో ఉన్న సిక్కు భక్తుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గురునానక్ తో పాటు సిక్కు వర్గాలపై ఉన్న గౌరవంతోనే కర్తార్ పూర్ కారిడార్ పునఃప్రారంభించాలని నిర్ణియించినట్లు తెలిపారు.

గురునానక్ జయంతి దృష్ట్యా కర్తార్ పూర్ కారిడార్ తెరవాలని కేంద్రం తీసుకన్న నిర్ణయంపై పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ కూడా స్పందించారు. వీరిద్దరూ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. నానక్ జయంతి అయిన గురుపూరబ్ సందర్భంగా కర్తార్ పూర్ కారిడార్ తెరవడం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమని వీరు ప్రశంసించారు. దీనిపై వీరిద్దరూ వేర్వేరు ట్వీట్లు చేశారు.
Welcome step …. The reopening of the Corridor of infinite possibilities … invaluable gift for Nanak naam levas … may the corridor of the Great Guru remain open eternally to shower blessings on one an all …. Sarbat da bhala pic.twitter.com/88Dw9o8nA9
— Navjot Singh Sidhu (@sherryontopp) November 16, 2021
My profound gratitude to PM @narendramodi and HM @AmitShah for the timely opening of the Kartarpur Sahib Corridor. It will provide a chance to thousands of devotees to pay obeisance at the holy shrine on the occasion of Guru Purab of Guru Nanak Dev Ji.
— Capt.Amarinder Singh (@capt_amarinder) November 16, 2021
గురునానక్ జయంతి సందర్భంగా కర్తార్ పూర్ కారిడార్ ద్వారా గురుగ్రంధ్ సాహిబ్ కు వెళ్లాలనుకునే సిక్కు భక్తులు.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని బీజేపీ నేత హర్జీత్ సింగ్ గ్రేవాల్ కోరారు. ఎల్లుండి నుంచి కారిడార్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. రెండు రోజుల క్రితం పంజాబ్ బీజేపీ నేతల బృందం ప్రధాని మోడీని కలిసి కర్తార్ పూర్ కారిడార్ ను మరోసారి తెరవాలని కోరారు. దీంతో వారి విజ్ఞప్తిని మన్నించిన కేంద్రం.. పాకిస్తాన్ కు వెళ్లే ఈ కారిడార్ ను తిరిగి తెరిచేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications