ఇందిర ఎమర్జెన్సీతో దేశం నష్టపోయింది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరా గాంధఈ దేశంలో విధించిన అత్యయిక స్థితితో భారత దేశం భారీగా నష్టపోయిందని ప్రదాని నరేంద్ర మోడీ ఆదివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ 113వ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన లోక్ తంత్ర్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనాటి ఎమర్జెన్సీ రోజులను మననం చేసుకున్నారు. దేశం గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారన్నారు. దీంతో, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జెపి నారాయణకు మీడియా ఎంతోగానే సహకరించిందన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జెపితో కలిసి పోరాడిన 14 మందిని సన్మానించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సంపూర్ణ విప్లవం నినాదంతో జేపీకి ప్రజలు, మీడియా ఎంతో సహకరించిందన్నారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల వల్ల ప్రజాస్వామ్యం బలపడిందన్నారు.
1977లో ఎన్నికలు జరిగే సమయానికి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రధాన నేతలు జైళ్లలో ఉన్నారని, ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని, ప్రజాస్వామ్యం పైన గౌరవాన్ని ఆ ఎన్నికల్లో ప్రజలు నిరూపించారన్నారు.












Click it and Unblock the Notifications