యూఎస్ జనరల్ అసెంబ్లీలో 27న మోడీ ప్రసంగం..!! తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా..!!!

న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో వచ్చే నెల 27న ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. వాతావరణ మార్పు, ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, చిన్న ద్వీపాలకు సహకారం వంటి పలు అంశాలపై ప్రసంగించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగిస్తారు.

27న రాత్రి 07.30 గంటల నుంచి 08.00 గంటల వరకు మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఇదీ ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రాథమిక జాబితా అనుగుణంగా షెడ్యూల్ .. అదేరోజు రాత్రి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రసంగించారు. మోడీ తర్వాత మిగతా నేతలు ప్రసంగించకుంటే .. ఇమ్రాన్ ముందు మాట్లాడే అవకాశం ఉంది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు గురించి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి.

modi likely to speech in un general assembley on sep 27

ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ అలాంటి ఆరోపణలు చేస్తే వెంటనే ఖండించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత అధికార వర్గాలు పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం వచ్చేనెల 23 ప్రధాని మోడీ న్యూయార్క్ చేరుకుంటారు. తొలుత ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. తర్వాత యూఎన్జీఏ సమావేశంలో ప్రసంగించి .. తిరిగి భారత్ బయల్దేరారని పీఎంవో వర్గాలు తెలిపాయి. అమెరికా పర్యటనలో భాగంగా పలువురు వివిధ దేశాల అధినేతలతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+