Modi: మోదీ మార్క్ రాజకీయం, 140 సీట్టు గ్యారెంటీ, రాసుకో, ఇక్కడ సేమ్ సీన్ రిపీట్, మళ్లీ మాదే అధికారం !
బెంగళూరు/గుజరాత్: నరేంద్ర మోదీ మార్క్ పరిపాలనతో ఈరోజు దేశం శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నదని, అందులో ఎలాంటి డౌట్ లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్. యడియూరప్ప అన్నారు. గుజరాత్ ఫలితాలతో ఇంతకాలం మోదీ మీద విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక సైలెంట్ గా ఉంటే మంచిందని మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప సూచించారు. కర్ణాటకలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయని, కచ్చితంగా బీజేపీ 140 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.
Lady teacher: పగలు పిల్లలకు పాఠాలు, రాత్రి బాయ్ ఫ్రెండ్స్ కు ?, మేడమ్ భర్త ?, కేసు రీఓపెన్ !
మోదీ మార్క్ రాజకీయం
కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అభివృద్ది పనులే ఈరోజు గుజరాత్ లో బీజేపీని గెలిపించిందని. ప్రజలు ముందుచూపుతో ఓటు వేశారని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం మానేసి ఆయన చేస్తున్న అభివృద్ది పనులకు సహకరించాలని మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప హితవుపలికారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఇది జరిగింది
హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రభుత్వం మారడం సర్వసాధారంగా జరుగుతోందని ఇప్పుడు అదే జరిగిందని, అందులో మేము ఎక్కువా భాదపడవలసిన అవసరంలేదని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప జోస్యం చెప్పారు.
నేను గ్యారెంటీ ఇస్తున్నా.... రాసుకోండి
కర్ణాటకలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయని, కచ్చితంగా బీజేపీ 140 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ది పనులు, కర్ణాటకలో బీజేపీ చేసిన అభివృద్ది మళ్లీ కర్ణాటకలో బీజేపీకి పట్టం కడుతుందని, అందులో ఎలాంటి డౌట్ లేదని మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.
ఇకనైనా ప్రతిక్షాలు సైలెంట్ గా ఉంటే మంచిది
తాను బీజేపీలోనే ఉంటానని, ఇప్నటికే రాష్ట్రం మొత్తం తిరగుతున్నానని, బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని మాజీ సీఎం బీఎస్, యడియూరప్ప అన్నారు. కర్ణాటకలో మేమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఎద్దేవ చేశారు.