ప్రజల్లో భయాందోళనలు నింపిన మోదీ : రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ దేశ ప్రజల్లో భయాందోళనలు నింపుతున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 132వ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: ప్రధాని మోదీ దేశ ప్రజల్లో భయాందోళనలు నింపుతున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 132వ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఏ వ్యక్తి కోసమో, ఏ కొందరి కోసమో పనిచేసే పార్టీ కాదన్నారు. తమ పార్టీ అందరికోసం పని చేసే పార్టీ అని, అదే సమయంలో అందరు చెప్పేది కాంగ్రెస్ వింటుందని.. కానీ బీజేపీ విషయానికొస్తే అది మోదీ ఒక్కరిదేనని, అక్కడ మోదీ చెప్పిందే అందరూ వింటారని ఎద్దేవా చేశారు. మోదీ తీసుకునే నిర్ణయాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు.

ప్రధాని మోదీ కూడా తనకు ఏదనిపిస్తే అదే చేస్తారని, ఇతరుల గురించి పట్టించుకోరని, ప్రజల గురించి అసలే పట్టించుకోరని, ఇందుకు పెద్ద నోట్ల రద్దు అంశమే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజల కష్టార్జితం అపహరణకు గురవుతోందని, వారి సొత్తు వారికి కాకుండా చేస్తున్నారని రాహుల్ దుయ్యబట్టారు.
ప్రధాని నోరు తెరిస్తే అవినీతిపై పోరు అని మాట్లాడతారని, సహారా, బిర్లా డైరీల ద్వారా వెలుగులోనికి వచ్చిన అవినీతి బాగోతం గురించి ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పరని అన్నారు. మోదీ దూకుడు, హింస, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి అని, ఆయన దూకుడుతనపు నిర్ణయాల పర్యవసానాన్నే ఇప్పుడు దేశ ప్రజలందరూ చూస్తున్నారని విమర్శించారు. ఏ నియమాల ప్రకారం ప్రధాని ప్రజలపై ఆంక్షలు విదిస్తున్నారో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications