వెంకయ్య వర్సెస్ మాయావతి..! : 'బీజేపీ వచ్చాకే ఈ పరిస్థితి'
న్యూఢిల్లీ : గుజరాత్ లో దళితులపై దాడుల అంశం పార్లమెంట్ లో వాడి-వేడి చర్చకు దారితీసింది. విషయాన్ని లేవనెత్తిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే దేశంలో దళితులపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్ లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మొన్నీమధ్యే గుజరాత్లోని యునా పట్టణంలో రెచ్చిపోయిన గో రక్షక దళం కార్యకర్తలు దళిత యువకులపై దాడికి పాల్పడి, వారితో పేడ తినిపించిన విషయాన్ని మాయావతి రాజ్యసభలో ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ వచ్చాకే దళితులపై ఇలాంటి దాడులు పెరిగాయని ఆరోపించారు.

బీజేపీని యాంటి దళిత్ పార్టీగా అభివర్ణించిన మాయావతి, గుజరాత్ లో జరిగిన ఆ ఘటన మీడియాలో చర్చనీయాంశం అయ్యాక గానీ అక్కడి పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని పట్టించుకోలేదని, ఇది బీజేపీ 'యాంటి దళిత్ మైండ్ సెట్' కు నిదర్శనమని విమర్శించారు.
మాయావతి చేసిన ఆరోపణల నేపథ్యంలో.. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంశాన్ని ప్రస్తావించాలనుకుంటే ప్రస్తావించవచ్చు గానీ, దాడితో సంబంధం లేని పార్టీల పేర్లు ప్రస్తావించడం సరైంది కాదన్నారు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications