మోడీ కలిసి పనిచేద్దామన్నారు.. రాష్ట్రపతి పదవీపై... శరద్ పవార్

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కలిసి పనిచేద్దామని చెప్పినట్టు పేర్కొన్నారు. కానీ ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు తెలిపారు. సోమవారం మరాఠీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ కామెంట్లు చేశారు.

వ్యక్తిగతంగా ఓకే..

వ్యక్తిగతంగా ఓకే..

మోడీతో తనకు వ్యక్తిగతంగా సన్నిహత సంబంధాలు ఉన్నాయని శరద్ పవార్ తెలిపారు. కానీ పార్టీ పరంగా విభేదాలు ఉన్నాయని చెప్పారు. అందుకే మోడీ కలిసి పనిచేస్తామని చెప్పినా.. సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పారు.

రాష్ట్రపతి పదవీ లేదు..

రాష్ట్రపతి పదవీ లేదు..


తనకు రాష్ట్రపతి పదవీ ఇస్తామని కేంద్రప్రభుత్వం నుంచి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ తన కూతురు సుప్రియ సులేకు కేంద్రమంత్రి పదవీ మాత్రం ఇస్తారని చెప్పినట్టు పేర్కొన్నారు. సుప్రియ సులే బారామతి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మోడీతో భేటీ

మోడీతో భేటీ


గతనెలలో ప్రధాని మోడీతో శరద్ పవార్ సమావేశమయ్యారు. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవీ చేపట్టడం, డిప్యూటీగా అజిత్ పవార్ చేపట్టిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో.. మహారాష్ట్రలో మహా డ్రామా ముగిసింది. అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్.. బలనిరూపణకు ముందే రాజీనామా చేయడంతో మహా సంక్షోభం ముగిసింది.

రాజ్యసభ 250వ సెషన్‌లో

రాజ్యసభ 250వ సెషన్‌లో

ఇప్పుడే కాదు రాజ్యసభ 250 సమావేశాల సందర్భంగా శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలను ప్రధాని మోడీ కొనియాడారు. వారిని చూసి నేర్చుకోవాలని కూడా సూచించారు. వారు ఎలా వ్యవహరిస్తారు, హుందాగా మెలగుతారు, వెల్‌లోకి దూసుకురారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+