ఈ సారి అధిక వర్షపాతమే.. ఏప్రిల్లో సాధారణం అని.. ఇప్పుడు ఇలా..
నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. నిన్న ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అయితే వర్షపాతానికి సంబంధించి భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని తెలియజేసింది. ఈ సీజన్లో సాధారణ వర్షపాతం 103 శాతంగా ఉండనుందని వివరించింది. ఈ సారి అధికంగా వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని తెలిపింది.
అయితే వర్షపాతానికి సంబంధించి ఏప్రిల్ నెలలో ఐఎండీ వెర్షన్ మరోలా ఉంది. అప్పుడు 99 శాతం వర్ష పాతం ఉంటుందని.. సాధారణ వర్షపాతమేనని తెలిపింది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదని చెబుతుంది. దేశవ్యాప్తంగా మంచి వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో తెలియజేశారు. మధ్య భారతలో వర్షం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈశాన్య ప్రాంతంలో మాత్రం కాస్త తక్కువగా ఉంటుందని తెలిపింది.

నిన్న ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరు చనిపోగా.. పలువరు గాయపడ్డారు. జమ మసీదు వద్ద డ్యామేజ్ జరిగింది. రహదారులపై భారీ వృక్షాలు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. జనం బిక్కు బిక్కు మని వెళ్లదీశారు. ఇవాళ, రేపు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్ష ప్రభావం ఉండనుంది. ఇప్పటికే కొన్నిచోట్ల వాతావరణం చల్లబడింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications