వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో స్త్రీతో భర్తకు లింక్: ఇద్దరు బిడ్డలను చంపేసింది

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: భర్తపై ప్రతీకారం తీర్చుకోవడానికి కన్నబిడ్డలను ఓ తల్లి అతి దారుణంగా హత్య చేసింది. తన భర్తకు సరైన బుద్ధి చెప్పాలని క్షణికావేశంలో ఆ తల్లి నవమాసాలు మోసి కనిపెంచిన పిల్లల పట్ల మృత్యు దేవత అయ్యింది.

జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని ఓ గ్రామంలో రుకియా బేగం అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు ఇమ్రాన్ (4), చాందిని (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని రుకియా బేగం అనుమానం పెంచుకునింది.

ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగేది. రుకియా బేగం భర్త సక్రమంగా ఇంటికి వెళ్లడు. ఈ విషయంలో రుకియా బేగం ఇంకా అనుమానం పెంచుకునింది. భర్త మీద పగ పెంచుకునింది. భర్తకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని నిర్ణయించింది.

Mother kills children in south Kashmir

గురువారం రాత్రి పదునైన ఆయుధం తీసుకుని ఇద్దరు బిడ్డలు ఇమ్రాన్, చాందినిని దారుణంగా చంపేసింది. తరువాత అదే ఆయుధంతో ఆమె పొడుచుకోవడంతో తీవ్రగాయాలైనాయి. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు రుకియా బేగంను ఆసుపత్రికి తరలించారు. భర్త మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రుకియా బేగం ఇద్దరు కన్న బిడ్డలను చంపేసిందని పోలీసు అధికారులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
In pursuance to this case the investigation was taken up by a special investigating team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X