మార్కెట్లోకి కొత్త ఫోన్, జీ 5 ప్లస్ పేరుతో మోటో కొత్త ఫోన్ ,అదిరిపోయే ఫీచర్లు
అదరగొట్టే ఆఫర్లతో మోటో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. న్యూఢిల్లీ ఈవెంట్గా మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది.
న్యూఢిల్లీ: అదరగొట్టే ఆఫర్లతో తన మోటో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్లో లాంఛ్ చేసింది. న్యూఢిల్లీ ఈవెంట్ గా మోటో జీ5 ప్లస్ స్మార్ట్ పోన్ ను ఆవిష్కరించింది.
మోటో జీ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ.14,999 ను విక్రయించనుంది. గత ఫిబ్రవరిలో బెర్నిలోనాలో జరిగిన ఎండబ్ల్యూసీ 2017 ఈవెంట్లో గ్లోబల్ గా ఆవిష్కరించింది. అయితే ఈ ఫోన్ ను కొన్ని వారాల వ్యవధిలోనే ఇండియా మార్కెట్లోకి తెచ్చింది.
ఈ ఫోన్ ను ఇ:డియా మార్కెట్ లోకి తెచ్చింది.అయితే ఇవాళ అర్థరాత్రి నుండి ప్లిప్ కార్ట్ అందుబాటులోకి తెచ్చింది.ఎక్చేంజ్ పై 1500 ఆఫ్ ను, ఎస్ బి ఐ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను కంపెనీ అందించనుంది.
అదనంగా రూ.1,199 విలువతో ఉచిత బైబ్యాక్ గ్యారంటీని ఇది కల్పిస్తోంది. ఈ బైబ్యాక్ ఆఫర్ కింద మోటో జీ 5ప్లస్ ను కొనుగోలు చేసిన ఆరు లేదా ఎనిమిది నెలల్లో మరో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఫిక్స్ డ్ ఎక్చెంజ్ డిస్కౌంట్ పై పొందే అవకాశం ఉంది.
అంతేకాదు ఎలాంటి ఈఎంఐ ఖర్చులు లేకుండా నెలకు రూ.1899 చెల్లింపుతో దీన్ని కొనుగోలు చేసుకొనే వెసులుబాటును కల్పించింది. రూ.599,రూ.1299 విలువ కలిగిన మోటో పల్స్ హెడ్ సెట్లను యూజర్లు పొందవచ్చు.2 జీబీ, 3 జీబీ ర్యామ్ 4 జీబీ ర్యామ్ వెర్షన్లలో ఇది లాంచ్ అయింది.