పనివాళ్లని ప్రైవేట్ పార్ట్స్పై కొట్టిన ఎంపి భార్య, మర్యాదలు
న్యూఢిల్లీ: బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) ఎంపి ధనుంజయ సింగ్ సతీమణి జాగృతి సింగ్ తనను, తనతో పాటు పని చేసే మనుషులను వేధించేందని పని మనిషి చెబుతున్నారు. ఎంపి, ఆయన సతీమణిలు ఓ పని మనిషి మృతి కేసులో అరెస్టు కాగా, మరో పని మనిషి తనను కూడా వేధించారని మెజిస్టేట్ ముందు చెప్పిన విషయం తెలిసిందే.
రాంపాల్ అనే పదిహేడేళ్ల పని మనిషి ఇచ్చిన వాంగ్మూలంలోని ఎఫ్ఐఆర్ మేరకు... చిన్న తప్పులు చేసినా జాగృతి సింగ్ తమను తీవ్రంగా వేధించేవారని, చితక బాదేవారని చెప్పాడు.
బాబీజీ ఒక్కోసారి ప్రయివేటు పార్ట్స్ పైన కొట్టేదని, పిసికినంత పని చేసేదని చెప్పాడు. తలుపు గడియను నోట్లో పెట్టి వేధించేదని తెలిపాడు. జాగృతి మాత్రమే కాకుండా ఎంపి ధనుంజయ కూడా పని మనుషులను కొట్టే వారని ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తోంది.
పని మనుషులు రాఖీ, మీనాలను పశ్చిమ బెంగాల్ నుండి న్యూఢిల్లీకి పంపించిన దేవ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా రాఖీ మృతి కేసులో ఎంపీ ధనుజంయను, ఆయన భార్య జాగృతిని పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు అరెస్టైన ఎంపీకి, ఆయన భార్యకు రాచమర్యాదలు అందుతున్నాయట. వారిని వేరువేరు గదుల్లో ఉంచారు. వాళ్లు ఇంటి నుండి భోజనం తెప్పించుకుంటున్నారట. ధనుంజయ్ సింగ్కు ఓ ఎస్సై రూం ఇచ్చారట. జాగృతి సింగ్ని అయితే ఎసిపి ఉపయోగించే విశ్రాంతి గదిలో ఉంచారట.