ముకేశ్ అంబానీ కూతురికి అతను ప్రపోజ్ చేశాడు: త్వరలోనే పెళ్లి!..
Recommended Video

ముంబై: దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ గారాల పట్టి ఈశా వివాహం నిశ్చయమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, పిరమాల్ సంస్థల వారసుడు ఆనంద్ పిరమాల్తో త్వరలోనే ఆమె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో కాబోయే వధూవరులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రాత్రి ముంబైలోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించడం విశేషం.
ఆనంద్ పిరమాల్ యువ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పిరమాల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తండ్రి అజయ్ ఈ సంస్థకు ఛైర్మన్. కాగా, అంబానీ, పిరమల్ కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా మంచి స్నేహం ఉంది.

ఇటీవల మహాబలేశ్వర్లోని ఓ ఆలయంలో ఆనంద్ ఈశాకు ప్రపోజ్ చేశారు. విషయం ఇంట్లోవాళ్లకు చెప్పడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు అందుకు ఒప్పుకున్నారు. ఆ వెంటనే ఇరు కుటుంబాలు కలిసి విందు కూడా చేసుకున్నాయి. డిసెంబర్ లో వీరి వివాహం జరిగే అవకాశం ఉందంటున్నారు.
ఇక ఈశా సోదరుడు ఆకాశ్ అంబానీ వివాహం కూడా డిసెంబర్ నెలలోనే జరగనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకతో ఆకాశ్ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications