తీవ్ర అస్వస్థత: ముంబైలో ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్
ముంబై: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ఆయనను చేర్పించారు.
ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను ముంబైకి తరలించాలని వైద్యులు సూచించడంతో ఇక్కడ చేర్పించామని ఎస్పీకి చెందిన నేత ఒకరు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు ములాయం.

ములాయం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా.. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేసేది ఈరోజు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తామని వైద్యులు వెల్లడించారు. కాగా, 80ఏళ్ల ములాయం యూపీ సీఎంగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టారు.
యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణశాఖ మంత్రిగానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ఎస్పీ అధినేతగా కొనసాగుతున్నారు. ఆయన కూడా యూపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications