బెంగళూరులో కుప్పకూలిన భవనం, స్కూటర్ లో వెలుతుంటే, అత్యాశతో, ప్రాణాలు !
బెంగళూరు: బెంగళూరు నగరంలో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం శిథిలాల కింద 10 మందికి పైగా చిక్కుకున్నారని బెంగళూరు నగర పోలీసు కమిషన్ టీ. సునీల్ కుమార్ చెప్పారు. 9 మంది కార్మికులకు తీవ్రగాయాలైనాయని పోలీసు కమిషన్ సునీల్ కుమార్ అన్నారు.
Recommended Video
స్కూటర్ మీద కుర్చుంటే
కుప్పకూలిన భవనం పక్కన ఇద్దరు ఆక్టీవా స్కూటర్ మీద కుర్చుని మాట్లాడుతున్న సమయంలో శిథిలాలు వారి మీద పడ్డాయి. స్కూటర్ మీద కుర్చుని ఉన్న ఇద్దరినీ గురువారం రాత్రి రక్షించి సెయింట్ జాయిన్స్ ఆసుపత్రికి తరలించారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు.
క్షణాల్లో ప్రాణలు
అదే కట్టడంలో పని చేస్తున్న ఉత్తర భారతదేశానికి చెందిన రఘువీర్ రెండు నిమిషాల ముందు సమీపంలోని అంగడికి వెళ్లి సిగరేట్ తీసుకోవడానికి బయటకు వచ్చాడు. భవనంలోపలికి వెలుతున్న సమయంలో కుప్పకూలిపోయింది. ఆ సమయంలో రఘువీర్ బయటకు పరుగు తియ్యడంతో గాయలతో ప్రాణాలు రక్షించుకున్నాడు.
యజమాని దురాశ
ఇంటి యజమాని పాత కట్టడం మీద మరో మూడు అంతస్తులు నిర్మించి అద్దెకు ఇవ్వాలని ప్రయత్నించాడని, పునాదులు గట్టిగా లేకపోవడంతో భవనం కుప్పకూలిపోయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందిద.
10 మంది గల్లంతు
కుప్పకూలిన భవనాన్ని బెంగళూరు మేయర్ సంపత్ రాజ్ పరిశీలించారు. తీవ్రగాయాలైన బాధితుల చికిత్సకు బీబీఎంపీ భరిస్తుందని సంపత్ రాజ్ హామీ ఇచ్చారు. కట్టడం యజమాని వివరాలు తెలియడం లేదని, వివరాలు సేకరిస్తున్నామని, 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని సంపత్ రాజ్ అన్నారు.
ట్రాన్స్ ఫారం
నాలుగు అంతస్తుల భవనం శిథిలాలు పక్కనే ఉన్న ట్రాన్స్ ఫారం మీద పడటంతో అది కుప్పకూలిపోయింది. ఈ దెబ్బతో కుప్పకూలిన కట్టడం పరిసర ప్రాంతాల్లో అర్దకిలో మీటర్ల పరిధిలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.