భార్యను హత్య చేసి.. రక్తమోడుతున్న మృతదేహంపై మూడు గంటలు!
ముంబై: భార్యతో తలెత్తిన చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీయడంతో.. విచక్షణ కోల్పోయిన ఓ భర్త భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం రక్తమోడుతున్న శవంపై మూడు గంటల పాటు అలాగే కూర్చుండిపోయాడు. మృగం కన్నా దారుణంగా అతడు వ్యవహరించిన తీరు ప్రతీ ఒక్కరిని విస్మయానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని కోహినూర్ టవర్స్ లో డెంటిస్ట్ బొబాలే(40) భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. స్పష్టమైన కారణాలేవి తెలియరానప్పటికీ.. ఆదివారం నాడు భార్య తనూజ(36)తో బొబాలే గొడవపెడ్డట్టుగా తెలుస్తోంది. ఇది కాస్త తీవ్ర వాగ్వాదానికి దారి తీయడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన బబోల్ కత్తితో ఆమెను కసితీరా పొడిచాడు.
బొబాలే తన భార్యను హత్య చేసిన సమయంలో.. పక్కన్నే పిల్లలు నిద్రిస్తూ ఉండటం గమనార్హం. హత్యానంతరం రక్తమోడుతున్న ఆమె మృతదేహంపై మూడు గంటల పాటు అలానే కూర్చుండిపోయాడు. ఉదయం 9.30 గంటలకు పోలీసులకు సమాచారం అందడంతో.. ఘటనా స్థలాన్ని పరిశీలించి బబోల్ ను అదుపులోకి తీసుకున్నారు.