ముంబైలో కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి...ఇద్దరు మృతి,చాలామందికి గాయాలు
ముంబై: ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురువారం సాయంత్రం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని సహాయం కోసం వేచిచూస్తున్నారు. ఇక అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఫుట్ఓవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో 35 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందులో 10 మందిని జీటీ హాస్పిటల్లో చేర్చగా... మరో ఆరుమందిని సెయింట్ జార్జ్ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
#WATCH Mumbai: A foot over bridge near Chhatrapati Shivaji Maharaj Terminus (CSMT) railway station has collapsed. Multiple injuries have been reported. pic.twitter.com/r43zS5eA0l
— ANI (@ANI) March 14, 2019
ఛత్రపతి శివాజీ టర్మినస్లోని 1వ ప్లాట్ ఫాంతో బీటీ లేన్తో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అనుసంధానమైంది.ఈ బ్రిడ్జి కూలిపోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ దారిలో వస్తున్న వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అంతేకాదు ఘటనలో గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించేందుకుగాను అంబులెన్స్లకు దారిని క్లియర్ చేయాలని కోరారు.
సిక్ లీవ్ పై వింగ్ కమాండర్ అభినందన్....ఎప్పటి వరకో తెలుసా..?
శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తమను కాపాడాలంటూ చిక్కుకున్నవారు కేకలు వేయడం పలువురిని కలచివేస్తోంది.