కోర్టులో సొమ్మసిల్లిన రేప్ విక్టిమ్ ఫొటో జర్నలిస్టు
ముంబై: నగరంలో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన 23ఏళ్ల ఫొటో జర్నలిస్టు.. కేసు విచారణ నిమిత్తం స్థానిక కోర్టుకు గురువారం హాజరైంది. కోర్టులో నాలుగు గంటలపాటు నిరీక్షించిన ఫొటో జర్నలిస్టు స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్ చెప్పిన వివరాల ప్రకారం.. అత్యాచార బాధితురాలిని వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు తీసుకురాగా ఆమె స్పృహ కోల్పోయిందని, ఆమెకు వైద్య సహాయం అందించాల్సిందిగా కోర్టును కోరినట్లు ఆయన తెలిపారు. కోర్టు అనుమతితో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

ఆగస్టు 22న ముంబైలోని శక్తి మిల్ కాంపౌండ్ పరిసర ప్రాంతంలో ఫొటో జర్నలిస్టుపై ఐదుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెతోపాటు వచ్చిన సహోద్యోగిని తీవ్రంగా గాయపరిచి ఆమెపై అత్యాచారం చేశారు. కాగా తన తల్లితోపాటు కెమెరా విచారణలో భాగంగా కోర్టుకు బాధితురాలు గురువారం హాజరయ్యారు. బాధితురాలు జరిగిన సంఘటనను పోలీసులకు, కోర్టుకు పూర్తిగా వివరించిందని ఆయన తెలిపారు. నిందితులు తనకు బలవంతంగా పోర్న్ వీడియోలు చూపించారని బాధిరాలు తెలిపినట్లు నిఖమ్ చెప్పారు.
చాలా సేపు నిరీక్షించిన బాధితురాలు అలసిపోయినట్లు గుర్తించి కొంత విరామం కావాలని కోరినట్లు ఆయన తెలిపారు. అంతలోపే బాధితురాలు స్పృకోల్పోవడంతో ఆస్పత్రికి తరలించామని, ఈ సంఘటనతో కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసినట్లు చెప్పారు. కాగా విచారణ సమయంలో నలుగురు నిందితులు తాము చేసిన తప్పును ఎలాంటి పశ్చాత్తాపము వ్యక్తం చేయలేదని తెలిపారు. ఐదుగురు నిందితులలో ఒకరిని నిందితుడిని జువైనల్నకు తరలించినట్లు ఆయన తెలిపారు.
నిందితులు విజయ్ జాదవ్, కాసీం బెంగాలీ, సలీం అన్సారీ, సిరాజ్ రెహమాన్ లపై ఛార్జీషీటు, అత్యాచారం, కుట్ర, అసాధారణ శృంగారం, సమాచార సాంకేతిక యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు సెప్టెంబర్ 19న 600పేజీల ఛార్జీషీటును నలుగురు నిందితులపై నమోదు చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications