చిత్తుగా తాగి నగ్నంగా మహిళ రైల్లో హల్చల్
ముంబై: చిత్తుగా తాగిన ఓ మహిళ మద్యం మత్తులో ఓ మహిళ ముంబై లోకల్ రైల్లో హంగామా చేసింది. తాగిన మైకంలో ఒంటిపై నూలు పోగు లేకుండా ఆమె కలకలం సృష్టించింది. ఆమెను జిఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె వల్ల రైలు 15 నిమిషాలు ఆలస్యమైంది.
మహారాష్ట్రలోని థానే రైల్వే స్టేషన్ నాలుగో ఫ్లాట్ఫాంపై ఆమె లోకల్ రైల్లో ఎక్కింది. మద్యం మత్తులో పిచ్చిగా అరవడం ప్రారంభించింది. కొంత మంది ప్రయాణికులు ఆమె పట్ల అనాగరికంగా ప్రవర్తించి ఆమె ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు మహిళా జీఆర్పీ పోలీసు కానిస్టేబుళ్ల సాయంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆమె తన గురించి ఏ విధమైన వివరాలు కూడా చెప్పలేదని పోలీసులు అన్నారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెపై సెక్షన్ 43 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆమె బాగా చదువుకున్నట్లు మాటలను బట్టి అర్థమవుతోందని అన్నారు. అయితే, ఆమె తనకు తానుగా దుస్తులు విప్పేసుకుందా, ఆ పని ఎవరైనా చేశారా అనేది తెలియడం లేదు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు సిసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆమె మంచి ఇంగ్లీషు మాట్లాడుతోందని చెప్పారు. ఆమె లోకల్ రైల్లోకి ఎక్కి ఇష్టం వచ్చినట్లు తిరుగుతుండడంతో ప్రయాణికులు కొంత మంది పోలీసులకు సమాచారం అందించారు.