ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్లో భారీ అగ్ని ప్రమాదం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగుతున్న 'ఆదిపురుష్' సినిమా షూటింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముహూర్తపు షాట్ రోజునే సెట్లో ఈ అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
8 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. సినిమా బృందానికి సభ్యులంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాద సమయంలో ఆదిపురుష్లో శ్రీరాముడిగా నటిస్తున్న కథనాయకుడు ప్రభాస్, రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ అక్కడ లేరు. కాగా, రూ. 400 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, సినిమా సెట్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. రామాయాణం ఆధారంగా రూపొందుతున్న భారీ బడ్జెట్, ప్యాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. టీ సిరీస్ బ్యానర్ భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ లతోపాటు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications