కేసులు వదిలించుకోడానికే హేమ హత్య: భర్త చింతన్
ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ప్రముఖ కళాకారిణి హేమా ఉపాధ్యాయ్(43), ఆమె తరపు న్యాయవాది హరీశ్ భంబానీ(65) కొద్ది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో హేమ భర్త చింతన్ ఉపాధ్యాయ్ను నిందితుడిగా గుర్తిస్తూ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కాగా, పోలీసులు విచారించగా.. కోర్టు కేసులు వదిలించుకోడానికే హేమా ఉపాధ్యాయ్ను హత్య చేసినట్లు ఆమె భర్త చింతన్ అంగీకరించాడు. కేసు వివరాల్లోకి వెళితే.. చింతన్, హేమా దంపతులిద్దరూ చిత్రకారులే. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో హేమ 2013లో చింతన్పై కేసు పెట్టింది.

అయితే కోర్టు కేసులతో విసిగెత్తిపోయిన చింతన్ ఎలాగైనా తన భార్యను చంపేందుకు నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం రెండు నెలల క్రితం విద్యాధర్ అనే మరో వ్యక్తితో కలిసి పథకం రచించాడు. విద్యాధర్ డిసెంబర్ 12న తన మనుషులతో హేమకు ఫోన్ చేయించాడు.
తమ వద్ద కొన్ని సాక్ష్యాలు ఉన్నాయని.. ఇవి చింతన్ నుంచి విడాకులు తీసుకునేందుకు ఉపయోగపడుతాయని హేమకు చెప్పారు. దీంతో హేమ వారిని దాదర్కు రమ్మని చెప్పింది. అయితే దాదర్ అంత సురక్షితం కాదని.. హేమను విద్యాధర్ వేర్హౌస్కు రమ్మని పిలిచారు.

ఇందుకు అంగీకరించిన హేమ, తన లాయర్ హరీశ్తో కలిసి వేర్హౌస్కు వెళ్లగా.. అక్కడ విద్యాధర్ వీరిద్దరినీ చంపేసి అట్టపెట్టెలో కుక్కి.. మృతదేహాలను సమీపంలోని చెత్తకుప్పల వద్ద పడేశారు.
కాగా, డిసెంబర్ 13న మృతదేహాలను గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో చింతన్ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. మంగళవారం అరెస్టు చేశారు. అతడ్ని విచారించగా.. తానే చంపినట్లు చింతన్ అంగీకరించాడు. కాగా, ప్రస్తుతం చింతన్కు జనవరి 1 వరకు కస్టడీ విధించారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications