అసభ్య ప్రవర్తన, బెదిరింపులు: రాధేమాపై మరో కేసు
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాపై మరో కేసు నమోదైంది. లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, బెదిరింపులకు రాధేమా(50) పాల్పడుతోందని పేర్కొంటూ నటీ డాలీ బింద్రా(45) అనే భక్తురాలు ముంబై పోలీసుల ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాధేమాతో పాటు ఆమె 19 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. కాగ, బాధితురాలు బింద్రా గతంలో రాధేమా భక్తురాలు. బింద్రా ఆగస్టు 11న ట్విట్ చేస్తూ ఇకపై రాధేమా భక్తురాలిగా కొనసాగనని పేర్కొంది.
రాధేమా, ఆమె అనుచరులతో తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని వెల్లడించింది. వరకట్న వేధింపుల కేసులో రాధేమాపై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే. విచారణను కూడా ఎదుర్కొంటున్నారు.
డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, పొట్టి దుస్తుల్లో ఉన్న రాధేమా ఫోటోలు సోషల్ మీడియాలో ఇటీవల హల్చల్ చేసిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, రాధేమా మత విశ్వాసాలను కించపరిచారంటూ పంజాబ్కు చెందిన సురేందర్ మిట్టల్ పోలీసులకు పిర్యాదు చేశారు. రాధేమా డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని, ఇవ్వనందుకు బెదిరించారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు.