మరో సంచలనం: రూ.99కే నమోటెల్ స్మార్ట్ఫోన్
బెంగళూరు: ఇటీవల రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ అనే సంస్థ ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు ఏకంగా రూ.99కే స్మార్ట్ ఫోన్ అందిస్తామని నమోటెల్ అచ్చే దిన్ సంస్థ ప్రకటించి మరో సంచలనానికి తెరతీసింది.
ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ అని సంస్థ సంస్థ ప్రమోటర్ మాధవ్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయమై బెంగళూరులో మాట్లాడుతూ.. మే 17 నుంచి 25 మధ్యఈ ఫోన్ బుకింగ్కి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఫోన్ ఫీచర్ల వివరాల్ని కూడా ఆయన వెల్లడించారు.
నమోటెల్.కామ్ సంస్థ వెబ్సైట్లో ఈ ఫోన్ని పొందుపరిచారు. దాని అసలు ధర రూ.2,999గా ఉండగా దాన్ని రూ.99కి తగ్గించినట్లుగా ఉంది. క్యాష్ ఆన్ డెలివరీతో దీన్ని కొనుగోలుదారులకు సరఫరా చేస్తామని సంస్థ తెలిపింది.

అందుకు నామమాత్రపు డెలివరీ రుసుము వసూలు చేస్తామని చెప్పింది. మేకిన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా ఈ ఫోన్ని తయారు చేశామని పేర్కొంది. ఆధార్ కార్డు ఉన్న భారతీయులకు మాత్రమే ఈ ఫోన్ని అమ్ముతామని స్పష్టం చేసింది.
టాప్10 ఫీచర్లు వివరాలు ఇవే:
- 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
- 1జీబీ ర్యామ్, 4జీబీ రోమ్
- 3జీ స్మార్ట్ ఫోన్
- 2ఎంపీ రేర్, .3ఎంపీ ఫ్రంట్ కమెరా
- డ్యూయెల్ సిమ్
- 4 అంగుళాల హెచ్డి డిస్ప్లే
- 1325 ఎంఏహెచ్ బ్యాటరీ
- ప్లాస్టిక్ హౌజింగ్
- తెలుపు, నలుపు రంగుల్లో ఫోన్ లభ్యం
- ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications