మత విషయంలో మోడీ, ఒబామా ఒకటే: రిచర్డ్ వర్మ
న్యూఢిల్లీ: మతపరమైన హింసా సంఘటనల విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకే విధంగా స్పందిస్తున్నారని భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అభిప్రాయపడ్డారు. భారత్లో చర్చిలపై జరుగుతున్న దాడుల తరహాలోనే అమెరికాలో అక్కడక్కడా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు.
అనేక సంప్రదాయాలు నిండిన భారతదేశం వంటి దేశంలో మత హింసకు తావుండరాదని భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే విధంగా మోడీ, బరాక్ ఒబామాలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. ఇటీవల మతపరమైన విషయాల్లో భారత్ సరైనరీతిలో స్పందించడం లేదంటూ ఓ అమెరికన్ సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విదేశాంగ శాఖ వివరణ కోరిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రిచర్డ్ వర్మ స్పందిస్తూ.. తమకు ఇండియాతో బలమైన సంబంధాలున్నాయని, మనస్ఫూర్తిగా మాట్లాడుకోకపోవడం వల్లే కొన్ని విషయాల్లో విభేదాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మాట్లాడుకోవడం వల్ల సమస్యలు పరిష్కారమై ముందుకు వెళ్లగలమని చెప్పారు.
రెండు దేశాలు అభ్యున్నతిని సాధిస్తూ ముందుకెళ్తున్నాయని రిచర్డ్ వర్మ తెలిపారు. మోడీ ఏడాది పాలనా కాలంలో అమెరికా-భారత సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని చెప్పారు. ఒక నూతన అధ్యాయనం మొదలైందని చెప్పారు. మోడీ, ఒబామా చేతులు కలపడం వల్ల రెండు దేశాల మధ్య చాలా ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications