హర్భజన్తో సిద్దూ ఫోటో పోస్ట్: కాంగ్రెస్లో చేరతారా..? బీజేపీలో మాత్రం నో
పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. వచ్చే ఏడాది ఎలక్షన్ జరగనుంది. అయితే నేతల చేరికలు జోరుగా జరుగుతున్నాయి. నిన్న మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలో భారీగా చేరికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్వీట్ చేశారు. అయితే ఆ ఫోటోలో హర్భజన్ సింగ్ ఉన్నారు. ఇటీవల బజ్జీ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. దీనిని హర్భజన్ ఖండించారు. అబ్బే అదేం లేదని తేల్చిచెప్పారు. ఇవాళ సిద్దూ బజ్జీతో కలిసి ఫోస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫోటో ట్వీట్ చేసిన సిద్దూ.. పిక్చర్ లోడెడ్ విత్ పాజిబిలిటీస్ అని రాసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉందని ఇండికేషన్స్ ఇచ్చారు. బజ్జీని సైనింగ్ స్టార్ అని సిద్దూ రాశారు. బీజేపీలో హర్భజన్ సహా యువరాజ్ సింగ్ చేరతారని ప్రచారం జరిగింది. వారితో తాము సంప్రదింపులు జరిపామని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. దీనిపై ఢిల్లీ క్రౌన్ పోస్ట్ చేయగా.. హర్భజన్ ఖండించారు. ఢిల్లీ క్రౌన్ ట్వీట్ను హర్భజన్ కొట్టిపారేశారు. అదీ ఫేక్ న్యూస్ అని ట్వీట్ చేశారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం సంపద్రింపులు జరుపుతూనే ఉన్నామని చెప్పారు.
ఇటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దిగ్విజయ్ నారాయణ్ చౌబే, బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీ, మాజీ ఎంపీ కౌశల్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే మాయా ఆ విధంగా కామెంట్స్ చేశారు. కానీ బీజేపీ అంటే మాయావతి అంటిముట్టనట్టుగానే ఉంటారు. మరీ ఎస్ఏడీతో ఎలా పొత్తు కొనసాగిస్తారో అర్థం కావడం లేదు. శిరోమణి అకాళిదల్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. వీరితో మాయవతి ఎలా కలిసి పనిచేస్తారో అర్థం కావడం లేదు. ఈ కామెంట్స్ను బట్టి.. మాయావతి ఆ కూటమిలో భాగస్వాములు అవుతారని అర్థం అవుతుంది.