నిఘా పెట్టిందా?: చైనా నౌకను తరిమేసిన ఇండియన్ నేవీ
న్యూఢిల్లీ: మనదేశ సముద్ర జలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ చైనా నౌకను భారత నావికాదళం తరిమికొట్టింది. ఈ ఘటన అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్బ్లెయిర్ వద్ద చోటు చేసుకుంది. చైనాకు చెందిన షియాన్ 1 అనే నౌక ఈ ప్రాంతంలోని సముద్ర జలాలలో పరిశోధనా కార్యక్రమాలు చేస్తోంది.
అయితే, మన దేశ జలాల్లోకి రావడంతో మన నావికాదళ నిఘా విమానం పసిగట్టింది. దీంతో పరిస్థితిని తెలుసుకునేందుకు భారత్ ఒక యుద్ధ నౌకను అక్కడికి పంపింది. భారత్కు చెందిన ప్రత్యేక వాణిజ్య జోన్లో ఇతర దేశాలకు చెందిన నౌకలు పరిశోధనా లేదా అన్వేషణ కార్యకలాపాలు సాగించడం నిషిద్ధం.

ఈ క్రమంలో ఆ చైనా నౌకను భారతీయ జలాల్లోనుంచి బయటకు వెళ్లమని మన దేశ యుద్ధ నౌక హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ నౌక భారత సముద్ర జలాల నుంచి చైనా వైపు కదిలిపోయినట్లు సమాచారం. కాగా, ఆ నౌకను చౌనా తన గూఢచర్య కార్యకలాపాలకు కూడా వాడుతుందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, హిందూ మహా సముద్ర జలాల్లో, ఆగ్నేయ సముద్ర జలాల్లో జరిగే కార్యకలాపాలపై మనదేశం నిఘా వేసి ఉంచడానికి అండమాన్ నికోబార్ ప్రాంతం కీలకంగా ఉంంది. సముద్రపు దోపిడీలను నిరోధించడం అనే వంకతో భారత సముద్ర జలాల్లోకి తరచుగా చైనాకు చెందిన నౌకలు వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత నావికాదళం గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. జిత్తులమారి చైనాకు ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూనే ఉంది.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications