అలర్ట్.. అలర్ట్.. సముద్రమార్గాన దాడికి పాక్ కుట్ర, నేవీ, పోలీసులను అప్రమత్తం చేసిన ఐబీ
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం రద్దుచేయడంతో పాకిస్థాన్ రగిలిపోతోంది. కశ్మీర్కు ఉన్న ప్రత్యేక హక్కులను ఎలా కాలరాస్తారని ప్రశ్నిస్తోంది. జమ్ముకశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడంతో అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు తెగబడే అవకాశం ఉందని భాతర నిఘా సంస్థలు అంచనావేశాయి. ఇందుకు వారు జలమార్గాన్ని ఎంచుకుంటారని .. తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఐబీ హెచ్చరికలతో నేవీ, పోలీసు విభాగాలు అలర్టయ్యాయి.
తీరం వెంబడి ..
భారతదేశానికి నదీతీరం 7 వేల 514 కిలోమీటర్లు ఉంది. ఇందులో పాకిస్థాన్తో కూడా నదీ తీరం ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. 2008లో సముద్రమార్గాన ముంబైలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆనాటి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగించడంతో దాడులకు తెగబడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇందుకు జలమార్గం ద్వారానే దేశంలోకి ప్రవేశించాలని ఉగ్ర మూకలు భావిస్తున్నాయని నిఘా విభాగానికి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో తీరప్రాంతల్లో రాడార్లా ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఐబీ స్పష్టంచేసింది. రెప్పపాటులో ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని .. అందుకోసం అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది.

జైషే కుట్ర ..?
ముఖ్యంగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు రౌఫ్ అజార్ దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. అతను ఇప్పటికే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో వేగంగా పావులు కదుపుతున్నాడు. పీవోకేలో జైషే మహ్మద్ సంస్థ కోసం ఉగ్రవాదుల నియామక ప్రక్రియను భారీగా చేపట్టారు. ఆ క్యాంపుల నుంచి ఉగ్రవాదులను సరిహద్దు మీదుగా పంజాబ్ తరలిస్తున్నట్టు విశ్వసీనయంగా తెలిసింది. దీంతో కశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని .. క్షణ క్షణం అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది. దీనికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా ప్రకటన బలం చేకూరుస్తోంది. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి తీసేయడంతో తాము దాడులు చేస్తామని కయ్యానికి కాలుదువ్విన సంగతి తెలిసిందే.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications